రష్మిక మందన్నకు గోల్డెన్‌ ఆఫర్‌…

హైదరాబాద్, ప్రజానేత్రం ఆగష్టు 14: బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో తెగ బిజీగా గడుపుతొంది కన్నడ బామ రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ని ఇండస్ట్రీలలో తెగ బిజీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం రష్మిక రేయిన్‌బో అనే ద్విభాషా సినిమా చేస్తుంది. శాంత రూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు శాకుంతలం ఫేమ్‌ దేవ్‌ మోహన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనితో పాటుగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్‌ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా నటిస్తుంది. గోల్డెన్ అపర్లతో రష్మిక మందన్న బిజీ.. బిజీ..

Scroll to Top