కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బాలకృష్ణకు సన్మానం

సంస్థాన్, ప్రజానేత్రం,సెప్టెంబర్ 20: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మందుగుల బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా ఓబీసీ జిల్లా కార్యదర్శి దంటిక అశోక్ యాదవ్ స్థానిక చౌరస్తాలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు మరెన్నో సేవలు చేసుకుంటూ మీరు మంచి మంచి పదవులు అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి నయిమ్ షరీఫ్, రాచకొండ రమేష్ బాబు, అందే నరేష్ యాదవ్, చిలుకూరి శ్రీనివాస్, రాస మల్ల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top