శాసన మండల చైర్మన్ గుత్తాను కలిసిన బిసి యువజన సంఘం నాయకులు కృష్ణ

మునుగోడు, ప్రజానేత్రం, సెప్టెంబర్ 19: చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుల గణనపై కోర్టు ఇచ్చిన తీర్పులను వెంటనే అమలు చేసి రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కులగనన్న తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగాం వెంకటేష్ గౌడ్, నకిరేకల్ లింగస్వామి గౌడ్, అలిశెట్టి యాదాద్రి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top