కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

సంస్థాన్, ప్రజానేత్రం,సెప్టెంబర్ 20: సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని గుజ్జ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ గారి సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, డిక్షనరీ మరియు గ్రామర్ బుక్స్ పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు అలాగే వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది అని అన్నారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకొని రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్లు సంపాదించి,వారి తల్లిదండ్రులకు మరియు వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకరావాలని కోరారు అదే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు .ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కస్తూరిఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పెంటయ్య ,మహేష్ ,నవీన్ రెడ్డి , నరేందర్ రెడ్డి , వీరమల్ల కార్తీక్ గౌడ్, ఎలిజాల శ్రీను, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top