క్రాంతి కాలనీ రోడ్డు నెంబర్ 1లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

  • వేలం పాటలో పెద్ద లడ్డును 1 లక్ష 32 వెయ్యిలకు దక్కించుకున్న కడారి దీప నరసింహ యాదవ్ దంపతులు
  • చిన్న లడ్డును 41 వెయ్యిలకు దక్కించుకున్న కేతావత్ రాజు నాయక్ శారద దంపతులు

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 30: బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని చెంగిచెర్ల క్రాంతి కాలనీ రోడ్డు నెంబర్ ఒకటి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి అంకంలో భాగంగా నిర్వహించన లడ్డూ వేలంపాటలో పెద్ద లడ్డును చెంగిచర్ల క్రాంతి కాలనీకి చెందిన ఓం శ్రీ లక్మీ నరసింహ స్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారి కడారి దీప నరసింహ యాదవ్ దంపతులు వారి కుమారుడు కడారి శేఖర్ యాదవ్ 1 లక్ష 32 వెయ్యిలకు మరియు చిన్న లడ్డును కేతావత్ రాజు నాయక్ శారద దంపతులు వారి కూతురు హేమ బిందు 41 వెయ్యిలకు దక్కించుకున్నారు.వారిని కమిటీ సభ్యలు శాలువాతో సన్మానించారు. ఈ మేరకు దంపతులు మాట్లాడుతూ నవరాత్రులు ఎంతో ఘనంగా పూజించిన లడ్డును మాకు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, కాలనీవాసులు పాల్గోన్నారు.

Scroll to Top