అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ లో చేరికలు: ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్ పల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 27: బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మాండ్ర గ్రామనికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మేడి శంకర్, యాదవ సంఘం అధ్యక్షుడు దొండ నర్సింహ యాదవ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఇంజమూరి రామలింగం, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల యాదయ్య, బిజేవైఎం గ్రామశాఖ అధ్యక్షులు గురిజ శ్రీకాంత్, బిజెపి గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి మేడి నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి రవి, నూనె శంకర్ లతో పాటు దాదాపుగా 50 కుటుంబాలు చేరారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు సైనికుల్లా పనిచేయాలని వారిని కోరారు.

Scroll to Top