![](https://prajanetram.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-08-at-7.34.33-PM.jpeg)
కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 08: నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే కెపి వివేకానంద ను తన నివాసంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో చారువాణిలో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.