![](https://prajanetram.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-29-at-8.50.36-AM.jpeg)
నల్గొండ, ప్రజానేత్రం, ఫిబ్రవరి 29: నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఓ రైతు పొలంలో మొసలి కలకలం రేపుతూ రైతులను భయాందోళన గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన రైతులు భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆనందరెడ్డి, సిబ్బంది మొసలిని స్వాధీన పరుచుకున్నారు.
![](https://prajanetram.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-29-at-11.55.03-AM.jpeg)
పొలాలకు సమీపంలో ఉన్న చెరువు నుండి ముసలి పంట పొలాల్లోకి వచ్చిందని ఆ ప్రాంత రైతన్నలు భయంతో ఉక్కిరబిక్కిరి అవుతున్నారు. పొలాలకు సమీపంలో ఉన్న చెరువులో ముసలిని పలుమార్లు చూసినట్టు పలువురు రైతులు చెబుతున్నారు.