చిరుధాన్యాలతో ఆరోగ్యానికి మేలు కార్యక్రమంఐసిడిఎస్ సూపర్వైజర్ వసంత

నాంపల్లి, ప్రజానేత్రం, మార్చి 14: మండలంలోని మల్లపురాజు పల్లి అంగన్వాడి కేంద్రాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పట్వాడ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంత హాజరై మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు తల్లిదండ్రులకు సాంప్రదాయక స్థానిక ఆహార పదార్థాలు కొర్రలు అరికలు సాములు కొండ అరికలు ఊదలు రాగులు. సజ్జలు మొదలైన చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వాటిని దైనందిక వంటకాలలో ఉపయోగించాలని వివరించారు అంగన్వాడి కేంద్రాలలో పోషకాహారాలని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ధనమ్మ రత్నమాల రామేశ్వరి ,బిక్ష పమ్మ సంతోష ఆయాలు చిన్నారులు తల్లులు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top