ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు సీట్లు బిసీలకు కేటాయించాలి

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు…

నల్గొండ, ప్రజానేత్రం, ఆగష్టు 17: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల సైదులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ, అదే తీర్మానం ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఆ దిశగా ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 85 శాతం ఉన్నారని వారికీ అవకాశాలు ఇవ్వాలని కోరారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Scroll to Top